World Cup 2023: “టీమిండియా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది..అందుకే అన్ని మ్యాచ్ లు గెలుస్తుంది”..పాక్ మాజీ క్రికెటర్ నీచపు కామెంట్స్..!

ఒకడు పైకి ఎదుగుతున్నాడు అంటే వాళ్ళ కాళ్ళను పట్టుకొని కిందకి లాగడానికి నాలుగు చేతులు రెడీగా ఉంటాయి. అది ఎటువంటి ఫీల్డ్ అయినా సరే . మనం ఎదుగుతూ ఉంటే పక్క వాళ్ళు చూడలేరు . ఓర్వలేరు. మన మీద రాయి వేయడానికి మనల్ని బాధపెట్టడానికి చూస్తూ ఉంటారు . ప్రజెంట్ అలాంటి పని చేస్తున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దానికి రీజన్ ఆయన రీసెంట్ గా టీం ఇండియా పై చేసిన సంచలన ఆరోపణలే.

మనకు తెలిసిందే వరల్డ్ కప్ 2023 సిరీస్ సూపర్ డూపర్ గా ముందుకి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు మన ఇండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆడిన ప్రతి మ్యాచ్లో విజయం సాధిస్తూనే వచ్చింది. ఓ పక్క బౌలర్లు మరోపక్క బ్యాట్స్ మెన్స్ కలిసికట్టుగా గేమ్ ని ముందుకు తీసుకెళ్తూ ఇండియాకి విజయాన్ని తీసుకొస్తున్నారు. నిన్న జరిగిన శ్రీలంక మ్యాచ్లో కూడా కేవలం 55 రూపాయలకే లంక టీం ను ఆల్ అవుట్ చేశారు . దీంతో వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది ఓ రికార్డుగా మిగిలిపోయింది .

అంతేకాదు ఏకంగా సెమీస్ కి క్వాలిఫై అయిన మొదటి టీం గా ఇండియా రికార్డ్ సృష్టించింది . దీన్ని జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా ఇండియా టీం పై దారుణాతి దారుణమైన ఆరోపణలు చేశారు . “మిగతా జట్ల బౌలర్ల కంటే టీమిండియా బౌలర్ లకు చాలా సింగ్ లభిస్తుంది అని .. ఐసిసి మరియు బీసీసీఐ భారత బౌలర్లకు ప్రత్యేక రూల్స్ ఇస్తుందని ..సంచలన ఆరోపణలు చేశారు “. అందుకే వాళ్ళు బ్యాటింగ్ పిచ్ పైన కూడా వికెట్లు జెట్ స్పీడ్ లో తీసేస్తున్నారని .. వాళ్ళు ఏ బాల్ వేసిన అది వికెట్ పడిపోతుందని .. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు..? అంతేకాదు టీమిండియా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందని .. వరల్డ్ కప్ కొట్టడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది అని సంచలన ఆరోపణలు చేశారు . దీంతో టీం ఇండియా ఫ్యాన్స్ అదే రేంజ్ లో ఆయనకు బుద్ధి చెబుతున్నారు .కష్టపడిఆడితే ఎవరైనా గెలుస్తారు బే అంటూ దిమ్మతిరిగిపోయే కౌంటర్స్ వేస్తున్నారు..!!