స్టార్ డైరెక్టర్ ఇంట విషాదం.. ఆ పని చేయకండి అంటూ ట్విట్ వైరల్..!!

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుములు ఇంట విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.. ఈయన కజిన్ అనారోగ్యంతో మృతి చెందినట్లుగా తెలియజేశారు.. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ తమ ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. కోవిడ్ తర్వాత వచ్చే జ్వరాన్ని నార్మల్గా అసలు ఎవరు తీసుకోవద్దని అలా ఆ సాధారణ జ్వరమే అనుకోని నిర్లక్ష్యం చేస్తే తన కజిన్ దూరం చేసుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు వెంకీ కుడుముల.

నా కజిన్ కి రెండు వారాలుగా జ్వరం వచ్చింది..కానీ అది కేవలం ఫీవర్ గానే భావించి సమయానికి డాక్టర్ వద్దకు వెళ్లలేకపోయాము.. దీంతో నిర్లక్ష్యం చేశాము..కానీ ఆ జ్వరం GB సిండ్రోమ్ అని పిలవబడే ఒక అరుదైన వ్యాధిగా వైద్యులు గుర్తించారట. మనిషిలో రోగ నిరోధక శక్తి అదుపుతవి నరాల పైన చాలా ఒత్తిడికి గురయ్యేలా చేస్తుందట. ఈ వ్యాధి తర్వాత ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయట. ఇది మొదట గుర్తించి సమయానికి చికిత్స తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.

కానీ వైద్య నిర్లక్ష్యం చేయడం వలన అతని జీవితం కోల్పోయాడని కుటుంబం తీరని విషాదానికి మిగిల్చిందని తెలిపారు. కోవిడ్ తర్వాత వచ్చిన ఏ జ్వరం అయినా సరే లైట్గా తీసుకోకూడదు.. మన శరీరం సరైన స్థితిలో లేనప్పుడు అది జ్వరం అనారోగ్యం లేకపోతే పలు రకాల అసౌకర్యాలను సైతం హెచ్చరిస్తుందట. దయచేసి ఇలాంటి సమయాలలో ప్రతి ఒక్కరు కూడా వైద్యుని వద్దకు వెళ్లి చెక్ అప్ చేయించుకోండి అంటూ ట్విట్టర్ రూపంలో తెలియజేశారు వెంకీ కుడుముల. ఆరోగ్యం వైపు ఒక చిన్న అడుగు వేస్తే కుటుంబాన్ని జీవితాలను కోలుకోలేనటువంటి నష్టం నుంచి కాపాడుతుందంటూ తెలిపారు.