కంటతడి పెట్టిస్తున్న యాంకర్‌ ఝాన్సీ మాటలు… జీవితంలో ఆమె అంతబాధ అనుభవించిందా?

టాలీవుడ్ యాంకర్‌ ఝాన్సీ గురించి తెలియనివారు దాదాపుగా ఇక్కడ వుండరు. చిత్ర పరిశ్రమలో మొదట యాంకర్ గా అడుగిడిన యాంకర్‌ ఝాన్సీ తరువాత కాలంలో సినిమాలో కూడా మెరిసింది. రకరకాల పాత్రల్లో నటిస్తూ నేటికీ ఆమె తనదైన ఉనికిని చాటుకుంటోంది. అయితే చిత్ర పరిశ్రమ అనేది ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ పని చేయాలన్నా మేనేజర్ల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. కాల్షీట్లు నుండి సినిమాలు, రెమ్యునరేషన్‌.. ఇలా అన్నీ మేనేజర్లే చూసుకుంటూ ఉంటారు వారికి. మేనేజర్‌ ఓకే అన్నాకే ఆయా ప్రాజెక్టులో భాగమవుతారు.

ఈ క్రమంలోనే మేనేజర్లకు సెలబ్రిటీలకు మధ్య మంచి రిలేషన్ ఏర్పడుతుంది. విషయం ఏమిటంటే, తాజాగా యాంకర్‌ ఝాన్సీ మేనేజర్‌ శ్రీను మరణించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆమె వేదన ఆమె మాటల్లో చూసుకుంటే, “శ్రీను.. ముద్దుగా నేను అతనిని సీను బాబు అని పిలుచుకుంటాను. నాకు అతడే పెద్ద సపోర్ట్‌. హెయిర్‌ స్టయిలిష్ట్‌ గా కెరీర్ మొదలు పెట్టిన అతడు నాకు వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా మారాడు. నా పనులన్నింటినీ ఎంతో సమర్థవంతంగా చేసిపెట్టేవాడు. ఓ రకంగా చెప్పాలంటే అతడే నా బలం. తను ఎంతో మంచివాడు, సహృదయుడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. అతడు నా దగ్గర పనిచేసే వ్యక్తి మాత్రమే కాదు. నా కుటుంబసభ్యుడు కూడా. ఇంకా చెప్పాలంటే నా తమ్ముడి కంటే ఎక్కువే. 35 ఏళ్లకే ఇలా గుండెపోటుతో మరణించడం చాలా దారుణం. ఇక మాట్లాడలేను. జీవితం నీటిబుడగలాంటిది” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది.

దాంతో ఈ పోస్ట్‌ పై పలువురు సెలబ్రిటీలు, అనేకమంది అభిమానులు స్పందిస్తూ యాంకర్‌ ఝాన్సీ మేనేజర్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. 35 ఏళ్లకే గుండెపోటు ఏంటి? దేవుడు ఎందుకిలా చేస్తున్నాడు? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.