నితిన్ కు నో చెప్పిన స్టార్ హీరోయిన్ లు….ఇక ఆమె దిక్కా..?

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు హీరో నితిన్. 2016 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ.. చిత్రం తరువాత అనేక ప్లాప్ లను మూటగట్టుకున్న నితిన్ మళ్లీ 2022 లో వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన భీష్మ చిత్రంతో మళ్లీ హిట్ అందుకున్నాడు. కానీ మళ్లీ ఈ చిత్రం తరువాత నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం మళ్లీ నిరాశపరిచింది. ఐతే ఇప్పుడు నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలోనే మరో చిత్రం చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్, మరియు సంగీతం జి వీ ప్రకాష్ కుమార్ అని ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకటిస్తూ ఒక చిన్న ఇంట్రో వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. కానీ డేట్స్ కుదరడం లేదు అని చెప్పి రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. రష్మిక కు తెలుగు పరిశ్రమలో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల. ఛలో చిత్రంతో రష్మికను తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసి, మళ్లీ భీష్మ చిత్రంతో ఆమె కెరీర్ కి మరో హిట్ కూడా ఇచ్చాడు. కానీ అటువంటి దర్శకుడికి కూడా రష్మిక నో చెప్పడం కాస్త ఆశ్చర్యంగా ఉంది.

ఈ చిత్రం నుంచి రష్మిక తప్పుకోవడంతో, ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల ను ఈ చిత్రం కోసం సంప్రదించారట మేకర్స్. కానీ ఆమె కూడా మొదట ఓకే చెప్పి ఇప్పుడు తప్పుకున్నట్టు తెలుస్తుంది. నితిన్ తో ఇప్పటికే “ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్” చిత్రంలో నటిస్తుంది శ్రీ లీల. ఆమె నటిస్తున్న చిత్రాలన్నీ దాదాపుగా పూర్తయినట్టే. భగవంత్ కేసరి చిత్రం విడుదలయింది. ఆది కేశవ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.

గుంటూరు కారం చిత్రం కూడా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇవన్నీ చూస్తుంటే ఆమె ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏమిటో తెలియడంలేదు. చివరిగా ఈ చిత్రానికి నాభ నటేష్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. మారి ఈ హీరోయిన్ అయినా సినిమా పూర్తి చేస్తుందో లేదో వేచి చూడాలి.