100 కోట్ల మోసం కేసులో ప్రకాష్ రాజుకు సమన్లు జారి..!!

టాలీవుడ్ కోలీవుడ్ లో విలన్ గా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.. పొలిటికల్ పరంగా కూడా కాస్త బిజీగా ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఈ నటుడు కి ED సామాన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది..100 కోట్ల విలువైన ఫాంజీ స్కీం కేసులో భాగంగా ఈయనను ED అధికారులు విచారణకు హాజరుకావాలని పిలిచారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నవంబర్ 20న తిరుచురాళ్లపల్లికి చెందిన ప్రణయ్ జ్యువెలరీ కి చెందిన ఒక భాగస్వామి సంస్థల్లో ఆస్తుల పైన దర్యాప్తు సోదాలు నిర్వహించి సామాన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ప్రణవ్ జువెలరీలో బోగస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తదితర స్కీముల పైన దర్యాప్తు భాగంగా ప్రకాష్ రాజ్ కీ సైతం ఈడి నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రణవ్ జువెలరీకి ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. దీంతో ప్రకాష్ రాజును వచ్చే వారంలో చెన్నైలో ఈడి అధికారులు హాజరు కావాలంటు ఒక నోటీసును సైతం తెలియజేశారు.. అయితే ఈ కేసులో ఇప్పటివరకు 11.60 కిలోల బంగారం తో పాటు 23.70 లక్షలకు విలువైన పలు నేరారహిత పత్రాలు లెక్కలలో చూపని నగదును సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రణయ్ జువెలరీస్ నిర్వహించిన ఫోంజి పథకం ద్వారా ఈ ఆర్థికంగా ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం.. అందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇది అధికారులు విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం జ్యువెలరీలో లాభాలు వస్తున్నాయని బంగారంలో పెట్టుబడి పథకం కింద పేరుతో ప్రజల నుంచి 100 కోట్ల రూపాయలు సైతం వసూలు చేశారట. అయితే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో పెట్టుబడుదారులు మోసం పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.