తెలుగులో కూడా యానిమల్ హవా మామూలుగా లేదుగా.. టార్గెట్ ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఓవర్ నైట్ కి స్టార్ డైరెక్టర్లలో చేరిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇదే సినిమాని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి అక్కడ కూడా హాట్ టాపిక్ గా మారారు. తన రెండవ చిత్రాన్ని రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కిస్తూ మంచి హైప్ క్రియేట్ చేసుకున్నారు.ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోయిన్గా రష్మిక నటించింది.

తెలుగు డైరెక్టర్, రష్మిక కూడా తెలుగు హీరోయిన్ కావడంతో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో మంచి మార్కెట్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమా హక్కులను భారీ ధరకే అమ్ముడుపోయినట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు దాదాపుగా 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.. ఈ చిత్రానికి సంబంధించి ఉత్తరాంధ్ర నైజాం ప్రాంతాలలో దిల్ రాజ్ సొంతంగానే విడుదల చేయబోతున్నారట. ఈ రెండు ప్రాంతాల మినహాయింపు ఇతర ప్రాంతాలలో 6 కోట్ల వరకు హక్కులను దిల్ రాజు అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీన్నిబట్టి చూస్తే నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో 9 కోట్ల వరకు కలెక్షన్ చేస్తే దిల్ రాజు సేఫ్ లో ఉంటారు. అయితే ఈ సినిమా మీద బజ్ ఉన్న కారణంగా 9 కోట్ల రూపాయలు కలెక్షన్స్ చేయడం పెద్ద విషయమేమి కాదని విశ్లేషకులు.. యానిమల్ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించాలి అంటే కచ్చితంగా 17 కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తే తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ఫుల్ మూవీ గా ఉంటుంది. బాలీవుడ్ లో విచిత్రానికి విక్కీ కౌశల్ నటించిన శ్యామ్ బహదూర్ సినిమా కూడా విడుదల చేయబోతున్నారు. అలాగే తెలుగులో సుడిగాలి సుదీర్ నటించిన కాలింగ్ సహస్ర వంటి సినిమాలు విడుదలవుతున్నాయి.