ఓటీటీ లోకి వచ్చేస్తున్న విశాల్ బ్లాక్ బాస్టర్ మూవీ మార్క్ ఆంటోనీ..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో మరొక నటుడు ఎస్ జె సూర్య కూడా నటించడం జరిగింది. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటించారు. అలాగే కమెడియన్ సునీల్, సెల్వ రాఘవన్ ,మీరా కృష్ణన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా విడుదల కావడం జరిగింది.

Mark Antony' Review: SJ Suryah is the heart and soul of this mindless time-travel film - India Today

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. తమిళ్, తెలుగు తో పాటు ఈ సినిమా భారీగా కలెక్షన్స్ను అందుకున్నట్లు తెలుస్తోంది. మార్క్ ఆంటోనీ సినిమాతోనే విశాల్ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది విశాల్. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన మార్క్ ఆంటోనీ సినిమా ఇప్పుడు ఓటీటి లో స్ట్రిమ్మింగ్ కు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

మార్క్ ఆంటోనీ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 13 నుంచి స్ట్రిమ్మింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. భారీ ధరకే ఈ సినిమా రైట్స్ ను కూడా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం పైన అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మార్క్ ఆంటోనీ సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రలలో నటించారు. హీరో విశాల్ అలాగే పలు రకాల గెటప్పులతో కూడా అభిమానులను మెప్పించారు. ఇందుకు సంబంధించి ఒక ట్విట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.