విరూపాక్ష-2 లో చిత్రంలో స్టార్ హీరో..!!

నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ దాదాపుగా ఎన్నో సినిమాలలో నటించిన కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవలే పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకటుకుంది. ఇక తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయలేదు అఖిల్. దీంతో అఖిల్ తాను తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా అని తీవ్ర ఆలోచనలో పడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన వైపు నుంచి తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి భేదాలు చూపకుండా తన దగ్గరకు వచ్చిన ఎలాంటి కథలైనా వింటూ ఉన్నట్లుగా తెలుస్తోంది అఖిల్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే అఖిల్ విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు అఖిల్ కి ఒక స్టోరీ వినిపించినట్లు సమాచారం.. ఈ స్టోరీ అఖిల్ కి నచ్చిందా లేదా అనే విషయం తెలియదు కానీ.. తన దగ్గర ఉన్న కథను మాత్రం అఖిల్ కి వినిపించడం జరిగిందట..

Tollywood: Stressful birthday for Akhil Akkineni?

అయితే ఇది విరూపాక్ష-2 స్టోరీ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ అఖిల్ ఈ సినిమాకి ఎస్ చెబితే కచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటారని చప్పవచ్చు.ఇటీవలే కార్తీక్ దండు విరుపాక్షి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా మొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. కార్తీక్ దండు జవాన్, కార్తికేయ వంటి సినిమాలకు కూడా రైటర్ గా పని చేశారట.