వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ ఫొటోస్.. !!

మెగా కుటుంబంలో వివాహమంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు తాజాగా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే వీరి యొక్క నిశ్చితార్థ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ వేడుకలకు చిరంజీవి ఫ్యామిలీతో అటు అల్లు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకు సంబంధించి పెళ్లి వేడుకలు ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. నిన్నటి రోజున సాయంత్రం వీరిద్దరి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా కుటుంబ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలలో మెగా ఫ్యామిలీ ,అల్లు ఫ్యామిలీ అందరూ ఒకే చోట పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా చిరంజీవి పంచుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారుతున్నాయి.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలసి మొదటిసారి మిస్టర్ అనే సినిమాలో నటించారు 2016లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యిందట. మొదట వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి ప్రపోజ్ చేసినట్లుగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత పలాస మూవీ డైరెక్టర్ తో మట్కా అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు.