సంక్రాంతి బరిలో ఆ హీరో మూవీ దెబ్బకు భయపడుతున్న మహేష్..!!

టాలీవుడ్ కి పెద్ద పండగ అంటే సంక్రాంతి అని చెప్పాలి. ఈ సీజన్లో టాలీవుడ్ కి వచ్చేంత వసూళ్లు ఏ సీజన్లో కూడా రాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్న ,పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతారు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా టాలీవుడ్ నుంచి వరుస వరుసగా సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ” గుంటూరు కారం ” ఒకటి. ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్నంత గ్రేస్ మరియు డిమాండ్ ఏ సినిమాకి కూడా లేదు.

ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా షూటింగ్ ప్రారంభం సమయంలోనే 160 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ సినిమాకి పోటీగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, వెంకటేష్ సైన్ఖవ్ మరియు నాగార్జున ‘ నా సామి రంగా ‘ , రవితేజ ఈగల్ సినిమాలు పోటీ పడబోతున్నాయి. అయితే వీటిల్లో గుంటూరు కారం సినిమా మాత్రం ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న సినిమా. నాగార్జున హీరోగా నటిస్తున్న ” నా సామి రంగ ” కమర్షియల్ మూవీ దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన నాగార్జున కమర్షియల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సునామీని సృష్టిస్తున్నాయి. గతంలో ” సోగ్గాడే చిన్ని నాయన ” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న పాటు సునామీనే సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమాకి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ” నాన్నకు ప్రేమతో ” మరియు బాలయ్య “డిక్టేటర్ ” సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కంటే కూడా ” సోగ్గాడే చిన్ని నాయన ” కి అత్యధిక వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ” నా సామి రంగ ” సినిమాతో కూడా నాగార్జున మహేష్ కి సవాళ్లు విసురుతున్నాడు. 2014 సంక్రాంతిని రిపీట్ చేయబోతున్నాడా అనేది తెలియాలి.