ఆ సినిమా నుంచి తప్పుకుంటే నానికి 50 కోట్లు ఇస్తానన్నారట..?!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని ఈ స్థాయికి ( పాన్ ఇండియా లెవెల్ కు) ఎదిగాడు అంటే దానికి కారణం అత‌డు ఎంచుకునే కథ‌లని చెప్పాలి. అలా నాని సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ కూడా భారీ సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే నాని సినిమా కథపై ఓ టాలీవుడ్ హీరో కన్నేసారని న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఏకంగా నానికి ఆ మూవీ నుంచి తప్పుకుంటే రూ.50 కోట్లు ఇస్తానంటూ ఆఫర్ చేశాడట.

ఇక ఆ సినిమా ఏది అనే విషయానికి వస్తే న్యాచురల్ స్టార్ నాని డ్యూయల్ రోల్ లో నటించిన శ్యామ్‌సింగరాయ్. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని సక్సెస్ అందుకుంది. కాగా నాని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరో హీరో నానికి ఫోన్ చేసి ఈ మూవీ నుంచి నువ్వు తప్పుకోవాలని చెప్పాడట. ఆ సినిమా నుండి నువ్వు తప్పుకుంటే నేను హీరోగా నటిస్తాను సినిమా కోసం నువ్వు తీసుకునే పారితోషికానికి రెట్టింపు రెమ్యూనరేషన్ అంటే రూ.50 కోట్లు నీకు ఇస్తాను అంటూ నానికి ఆఫర్ చేశాడట.

అయినా నాని మాత్రం తను ఒప్పుకున్న సినిమా నుంచి తప్పుకోవడం కుదరదు అంటూ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఆఖరికి నాని అనుకున్నట్టుగానే ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ఉంటే నాని దసరా సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం నాని హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన గాజు బొమ్మ ఆడియో సాంగ్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్‌టచ్‌తో సాగిన ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు.