చ‌రిత్ర సృష్టించిన త‌మ‌న్నా.. ఏ ఇండియ‌న్ హీరోయిన్ కు ద‌క్క‌ని అరుదైన గౌర‌వం మిల్కీ బ్యూటీ సొంతం!

దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే డిజిటల్ మీడియాకు ఆదరణ రోజు రోజుకు పెరగడంతో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు అనేక బ్రాండ్స్‌ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తోంది. అయితే తాజాగా తమన్నా చరిత్ర సృష్టించింది.

ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవాన్ని తన సొంతం చేసుకుంది. జపాన్ కాస్మోటిక్ దిగ్గజం షిసిడో భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను నియమించింది. వందేళ్ళకు పైగా కాస్మోటిక్ విభాగంలో అగ్రగామిగా సత్తా చాటుతున్న షిసిడో.. భారతీయ మహిళలను ఆకట్టుకునేందుకు తమన్నాను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. ఇప్పటివరకు షిసిడో కాస్మోటిక్స్ ఏ ఇండియన్ హీరోయిన్ బ్రాండ్ అంబాసిడర్స్ గా లేరు.

ఇప్పుడు ఆ ఘనత సాధించిన తొలి భారతీయ హీరోయిన్ గా తమన్నా నిలిచింది. దీంతో మిల్కీ బ్యూటీ ఆనందానికి అవ‌ధులు లేకుండా లేకుండా పోయాయి. కాగా సినిమాల విషయానికి వ‌స్తే.. ఇటీవల భోళా శంకర్‌, జైలర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తమన్నా.. ప్రస్తుతం మలయాళ హిందీ భాషల్లో బాంద్రా, ఆఖ్రీ సచ్, వేదా, అరణ్మనై 4 వంటి చిత్రాల్లో న‌టించింది. తెలుగులో మాత్రం త‌మన్నాకు ఒక్క సినిమా కూడా లేదు.