ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సమంత పై మహేష్ బాబు ఫైర్..

ప్రముఖ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు ఛాలెంజింగ్ రూల్స్ మాత్రమే కాకుండా బోల్డ్ రోల్స్‌ కూడా చేస్తూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ అమ్మడు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. విడాయకులయ్యాక అవకాశాలు తగ్గుతాయన్నారు కానీ ఆమెకు ఇప్పుడే మరిన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. సమంత మొదటి నుంచి ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది. తన అనారోగ్యం గురించి కూడా ధైర్యంగా బయట పెట్టింది. అయితే కొన్ని మనసులో దాచుకోకుండా అందరి ముందు వ్యక్తపరిచే ఆ మనస్తత్వమే ఒకసారి మహేష్ బాబుకు కోపం తెప్పించింది.

అసలేం జరిగిందంటే 2013లో మహేష్ బాబు తన అప్‌కమింగ్ ఫిల్మ్ 1: నేనొక్కడినే నుంచి పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో మహేష్ బాబు బీచ్‌లో నడుస్తుండగా, కృతి సనన్ నాలుగు కాళ్లతో అతడి వెనకే పాకుతున్నట్లు చూపించారు. ఈ పోస్టర్ ఆడవాళ్ళని తొక్కేసినట్లుగా, వారిని ఎప్పటికీ వెనుకబడినట్టుగా చూస్తున్నారన్నట్లు సమంత రూత్ ప్రభు ట్వీట్ చేస్తూ “డీప్లీ రిగ్రెసివ్”గా అభివర్ణించింది. ఈ ట్వీట్ మహేష్ బాబు, అతని అభిమానులకు కోపం తెప్పించింది, సమంతా ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడూ చేయలేదా అని చాలామంది ఆమెను తిట్టిపోశారు.

సమంతకు తనకు, తన భార్యకు వ్యక్తిగతంగా తెలుసునని, ఆ పోస్టర్ విషయంలో తనకు ఏమైనా సందేహాలుంటే నేరుగా తనను సంప్రదించి ఉండాల్సిందని మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలా బహిరంగంగా ఏది పడితే అది చెప్పేయడం బాగోలేదని అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంపై సమంత రూత్ ప్రభు తర్వాత స్పందించలేదు. అయితే అప్పట్లో మహేష్ బాబు మనసును నడిపించేలా సమంత మాట్లాడిందని ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఆమె చేసిన ట్వీట్ కూడా వైరల్ చేస్తున్నారు.