SSMB -29 మూవీ లాంచింగ్ డేట్..?

రాజమౌళి ,మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా పైన అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి చాలాకాలం తర్వాత మహేష్ అభిమానులలో ఒక ఉత్కంఠత నెలకొనిందని చెప్పవచ్చు. ఇండియన్ సినీ పరిశ్రమలో ఊరిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ముహూర్తం ఎప్పుడు అనే విషయం పైన పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్ ,రామ్ చరణ్, రానా తదితర హీరోలను సైతం పాన్ ఇండియా హీరోలుగా చూపించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ ని పాన్ వరల్డ్ హీరోగా ఆవిష్కరించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ కాంబినేషన్ కోసం చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఏ విధమైనటువంటి అప్డేట్ ని ప్రకటించలేదు.. కేవలం తన తండ్రి కీరవాణి , రాజమౌళి కుమారుడు మాత్రమే ఈ సినిమా పైన పలు రకాల అప్డేట్లను ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి 2022లో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ గురించి అధికారికంగా వార్తలు వినిపించాయి. ఈ సినిమాకి కేవలం SSMB -29 అనే పేరును మాత్రమే పెట్టడం జరిగింది. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న కథ అనే విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర తెలియజేశారు.

మరొకవైపు త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమాలో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళితో మహేష్ బాబు సినిమా సెట్లోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుకి రాజమౌళి చాలా స్పెషల్ ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం సిద్ధం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి అవకాశం ఉన్నది.. 2025 చివరిలో విడుదల అయ్యేందుకు ఆస్కారం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఇండియాలోని అత్యంత క్రేజీ సినిమాగా నిలవబోతోందట.