వివాదంలో హీరో శివాజీ.. అమ్మాయి పట్ల అసభ్యకర ప్రవర్తన

బిగ్‌బాస్-7లో హీరో శివాజీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. ఇంట్లో పెద్దరికంగా ఉంటూ అందరితో మంచిగా మాట్లాడుతూనే గేమ్స్, టాస్క్ లలో రాణిస్తున్నాడు. శివాజీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వస్తున్నా.. సింపుల్ గా తన ఆట ఆడుతున్నారు. ఈ సీజన్ మొత్తంలో శివాజీకే రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వారానికి ఆయనకు రూ.4 .లక్షలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే శివాజీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

అయితే ఇప్పటివరకు హౌస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ఇక ఈ వారం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ లలో నామినేషన్స్ ప్రక్రియ ప్రసారం అవ్వగా.. లేటెస్ట్ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. గులాబీ పురం, జిలేబీ పురం అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో టేస్టీ తేజ, శోభాశెట్టి మధ్య కాసేపు గొడవ చోటుచేసుకోగా… శివాజీ, సందీప్, అశ్విని శ్రీ మధ్య జరిగిన మాటలు కాస్త అసభ్యకరంగా ఉన్నాయ.

టాస్క్ లో భాగంగా తోటకు రా అని అశ్విని శ్రీని శివాజీ అనగా.. ఓ పెద్దాయన అది చాలా లేతాకు అన సందీప్ అంటాడు.. దీంతో ఆకు ఆకే కదా.. ఏదైనా ఏంట్రా అని శివాజ అంటాడు. ఏ ఆకు అయినా మనం సున్నం రాస్తాం అని శివాజీ మాట్లాడిన మాటలు అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శివాజీ వ్యాఖ్యలు మితిమీరి ఉన్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతోమంది చూస్తారు. కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ చూడటం లేదని, అందుకే బిగ్ బాస్ రేటింగ్స్ తగ్గాయని అంటున్నారు. ఇలాంటి అసభ్యకర కామెంట్స్ వద్దని సూచిస్తున్నారు.