ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మరాఠి కుటుంబంలో జన్మించిన రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఆ తర్వాత `జానీ` మూవీలో పవన్ కళ్యాణ్ తో కలిసి మళ్లీ జతకట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడి సహాజీవనం మొదలు పెట్టారు. ఒక కుమారుడికి కూడా జన్మనిచ్చారు.
ఆపై 2009లో పెళ్లి చేసుకోగా.. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులకు ఒక కూతురు పుట్టింది. అయితే 2012లో వీరు వ్యక్తిగత విభేదాలతో విడాకులు తీసుకున్నారు. పవన్ తో ప్రేమ, సహజీవనం, పెళ్లి, విడాకులు కారణంగా రేణు కెరీర్ ను ఏ మాత్రం పట్టించుకోలేకపోయింది. దాంతో హీరోయిన్ గా ఫేడౌట్ అయింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.
రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రేణు ఓ కీలక పాత్రలను పోషించింది. ఈ మూవీ సక్సెస్ అయితే రేణు నటిగా మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఎలా లైఫ్ లీడ్ చేసింది.. ఆమెకు సంపాదన ఎలా వస్తుంది అన్న డేట్ చాలా మందికి ఉంది. పవన్ తో విడాకులు తీసుకున్నాక రేణు దేశాయ్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారం మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా మారింది. తన ఫ్యామిలీలో తండ్రి అదే వృత్తి చేసేవారట. దాంతో రేణు దేశాయ్ కూడా అదే వృత్తిని ఎంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణు స్వయంగా ఈ విషయాన్ని తెలిపింది. ఇప్పటికీ హైదరాబాద్, పూణేలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ భారీగా సంపాదిస్తోంది. ఇప్పుడు సినిమాల ద్వారా కూడా ఆమెకు ఆదాయం మొదలైంది.