గుంటూరు కారం సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశి..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్ర గుంటూరు కారం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తూ ఉన్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి పలు రకాల అప్డేట్ ల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు.. మొదటి పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న సమయంలో ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొన్నిపే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఉండబోతుందని ఈ సినిమా నిర్మాత నాగవంశి తెలియజేయడం జరిగింది.


అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి నాగావంశి గుంటూరు సినిమా విషయంపై ఆప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను దసరా రోజున లేకపోతే అంతకంటే ముందే తామ ప్రకటిస్తామంటూ తెలిపారు.. దీంతో మరో వారం రోజుల్లో గుంటూరు కారం సినిమా ఫస్ట్ సింగిల్ రెడీ అయ్యేందుకు అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ పాట రిలీజ్ కూడా ఉంటుంది అంటూ నాగవంశీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక ప్రెస్ మీట్ కు హాజరైన నాగవంశీ ఈ విషయం పైన స్పందించారు.

గుంటూరు కారం సినిమా మొదటి సాంగ్ సిద్ధమయ్యిందని దసరా టైం కి డేట్ చెబుతామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ అందిస్తున్నారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తోంది అలాగే జగపతిబాబు జయరామ్ రమ్యకృష్ణ సునీల్ బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ తదితరులు సైతం ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాని ఖచ్చితంగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటిస్తోంది.