జపాన్ మూవీ ట్రైలర్ రిలీజ్.. దొంగగా రెచ్చిపోయిన కార్తి..!!

పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం జపాన్.. ఈ సినిమాతో త్వరలోనే వెండితెర పైన కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా అను ఇమ్మానుయేల్ నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా సునీల్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేయడం జరిగింది. వైవిద్యమైన కథ అంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కార్తీ చాలా విభిన్నమైన లుక్కులో కనిపించారు. ఇందుకోసం ఆయన తన లుక్కుని పూర్తిగా మార్చేయడం జరిగింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది చిత్రబృందం. ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్ చేసే పాత్రలో కనిపించబోతున్నారు. కామెడీ జోడించి సరికొత్త అవతారంలో అలరించబోతున్న కార్తి.. జపాన్ ట్రైలర్ విషయానికి వస్తే సముద్రం ఒడ్డున నివసించే (కార్తీ )చిన్న వయసులోనే తల్లి కోసం దొంగగా మారినట్టు ఈ ట్రైలర్ లోని మొదట చూపించడం జరిగింది. తన దొంగతనాలతో పోలీసులకు ప్రభుత్వానికి జపాన్ ఎలా అలజడి సృష్టించారనే కథాంశంతో ఈ సినిమా ట్రైలర్ తెరకెక్కించారు.

ఇందులోని కార్తి చెప్పే డైలాగులు కూడా కాస్త ఆకట్టుకునేలా ఉన్నాయి. తమిళనాడులో అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నైనా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి. తెలుగులో అన్నపూర్ణ స్టూడియో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జపాన్ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.