ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలతోనే బాగానే ఆ తర్వాత ఎందుకో అవకాశాలు రాక ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న పియా బాజ్ పాయ్ అందరికీ సుపరిచితమే అయితే ఈమె పేరు వినకపోవచ్చు కానీ.. జీవ నటించిన రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్గా అల్లరి పిల్లగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

పియా బాజ్ పాయ్ అంతేకాకుండా అమితాబచ్చన్ మహేంద్రసింగ్ ధోని వంటి వారితో కూడా పలు రకాల యాడ్స్లలో నటించింది. సినిమాలలో ఎక్కువగా అల్లరి పిల్లగానే మెప్పించిన ఈమె ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైన పెద్దగా కనిపించలేదు.. ఇటీవలే ఓటీటి పలు రకాల వెబ్ సిరీస్లలో కనిపిస్తోంది. అదేవిధంగా సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. చాలామంది వీటిని చూసి తనని గుర్తుపట్టలేకపోయామంటూ చివరికి రంగం హీరోయిన్ అనే విషయం తెలియగానే అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.. ఉత్తరప్రదేశ్లోని ఎతవాలో పుట్టి పెరిగిన పియా బాజ్ పాయ్ ఆ తర్వాత ముంబైకి వచ్చి మోడలింగ్ గా ప్రారంభించిందట. పలు రకాల యాడ్స్ చేసిన తర్వాత 2008లో తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత నిన్ను కలిశాక అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె రంగం సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత నవీన్ చంద్రతో దళమని ఒక సినిమాలో నటించింది. 2018 తర్వాత ఏమి సినిమాలు చేయలేదు.

 

View this post on Instagram

 

A post shared by Pia Bajpiee (@piabajpai)