హీరోయిన్ రాధా కూతురు ఎంగేజ్మెంట్.. వైరల్ గా మారుతున్న ఫొటోస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో ఎక్కువగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ కుమార్తె కార్తీక నైర్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో నటించింది.. అక్కడ రంగం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో కూడా నటించిన ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత అల్లరి నరేష్ తో బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అనే సినిమాలో నటించింది.ఇది కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇటీవల సినిమాల పరంగా యాక్టివ్ గా లేకపోయినా సడన్గా కార్తీక ఎంగేజ్మెంట్ పూర్తయింది అంటూ తమిళనాడులో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మీ ఇంస్టాగ్రామ్ లో ఒక క్రేజీ పోస్టును షేర్ చేయడం జరిగింది.

ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఒక వ్యక్తి హగ్ చేసుకుని ఉన్న ఫోటోని ఆ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయక ఆ పిక్ లో తన వేలికి ఉన్న రింగు కూడా హైలెట్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది దీంతో కార్తీక నిశ్చితార్థం చేసుకుందని పలువురు అభిమానులు భావిస్తున్నారు. కానీ వరుడు ఎవరని విషయం మాత్రం ఇంకా తెలియజేయలేదు.. మరి కార్తీక్ ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. మరి వివాహం కూడా త్వరలోనే జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో ఈమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.