తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి , జెమినీ గణేషన్ వైవాహిక చరిత్ర గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ మహానటి చిత్రమే ఇప్పటి వారికి ఒక ఆధారం.. అయితే ఆ సినిమా చూసి జనాలంతా సావిత్రి పడ్డ కష్టాల గురించి మాత్రమే తెలుసుకున్నారు. అయితే సావిత్రి మీద తీసిన ఈ మహానటి సినిమా కొంత కల్పితం అని.. అదంతా వాస్తవం కాదు అని జెమినీ గణేషన్ కుటుంబ సభ్యులు ఈ సినిమాపై పెదవి విరిచిన విషయం తెలిసిందే . తమ తండ్రిని నెగిటివ్గా చూపించడం పై కూడా మండిపడ్డారు.
ఇక ఈ క్రమంలోనే తాజాగా జెమినీ గణేషన్ కూతురు కమల సెల్వరాజ్ మాట్లాడిన మాటలు మళ్ళీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. జెమినీ గణేషన్ కి అప్పట్లో ఉండే క్రేజ్ ఆయన మంచితనం గురించి కమల చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. మా నాన్న చాలా ఉన్నతమైన వ్యక్తి.. అందగాడు.. ఆయన కోసం ప్రతి రోజు అమ్మాయిలు గేటు వద్ద ఎదురుచూసేవారు.. మేము ఎప్పుడైనా నాన్నతో కలిసి బీచ్ కి వెళ్తే మీ చెల్లెలా అని అడిగేవారు.. అంత యంగ్ గా కనిపించేవారు. ఎప్పుడూ అమ్మాయిలు వస్తుంటే వారికి నచ్చచెప్పి ఇంటికి తిరిగి పంపించేవారు.
ఇక ఆయన ఎప్పుడూ కూడా ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడగలేదు. ఆయన కోసమే అమ్మాయిలు వచ్చేవారు. మా నాన్న ఎంతో చదువుకున్నవాడు.. ఎంతో మంచివారు డీసెంట్ గా ఉండేవారు కానీ మహానటి సినిమాలో మాత్రం మా నాన్న గురించి చూపించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాము అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే మహానటి సావిత్రిని కూడా తన నాన్న పెళ్లి చేసుకుంటానని అడగలేదు అన్నట్టుగా సావిత్రి గురించి ఈమె పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఇకపోతే సినిమా తీస్తున్నప్పుడు తమను సంప్రదించలేదని , తమను అడిగితే ఎన్నో విషయాలు తెలిసేవి అంటూ రమప్రభ లాంటి వారు కూడా ఫైర్ అయిన విషయం తెలిసిందే.