నేను మీతో మాట్లాడుతూనే చనిపోవచ్చు.. మా నాన్న, నాన్నమ్మ కూడా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్…!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ” టైగర్ నాగేశ్వరరావు సినిమాలోని లవణం ఫ్యామిలీకి చెందిన రోల్లో నటిస్తున్నాను. ఆ పాత్ర నన్ను ఎంతగానో ఛేంజ్ చేసింది. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను పూర్తిగా యాక్టింగ్ కు దూరం అవ్వలేదు.

నాకు హెల్త్ ప్రబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్ సమస్య ఉంది. ప్రస్తుతం ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నాను. ఎతైనా చోట నడిస్తే వెంటనే ఆయాసం వస్తుంది. నాకు జన్యుటిక్ సమస్య ఉంది. మా నాన్నమ్మ 47 ఏళ్లలో ఇదే ప్రాబ్లం తో మరణించారు. మా ఫాదర్ కూడా సేమ్ ప్రాబ్లం తో చనిపోయారు. నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు. ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేను. ఇప్పుడు మీతో మాట్లాడుతూ సడన్గా మరణించొచ్చు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.

కానీ నా బాధంతా నా పిల్లల గురించే ” అంటూ రేణు దేశాయ్ కంటతడి పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నా… పవన్ కళ్యాణ్ తన పిల్లలను చూసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రేణు దేశాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.