నటుడు అచ్యుత్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇదే..!!

ఇండస్ట్రీలో కొంత మంది నటీనటుల మరణాలు ఎంతో మంది అభిమానులను బాధ కలిగిస్తూ ఉంటాయి. అయితే వారు మరణించినప్పటికీ వారి పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటాయి. అలాంటి నటులలో అచ్యుత్ కూడా ఒకరు.అచ్యుత్ అంటే ఈ తరం ప్రేక్షకులకు గుర్తుకు రాకపోవచ్చు.. కానీ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలోని తన అన్నయ్య గా నటించిన చక్రి అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టేస్తారు.ఎన్నో సీరియల్స్ లో హీరోగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అచ్యుత్.. ఒక్కసారిగా గుండెపోటుతో మరణించారు

ఈ విషయం అప్పట్లో ఎంతో మంది ప్రేక్షకులను శోకసముద్రంలోకి నెట్టివేసింది. మంచి పాపులారిటీ సంపాదించుకున్న సమయంలో ఇలా జరగడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా ఈటీవీలో ఎక్కువగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఉండేవారు అచ్యుత్.. గతంలో కూడా ఈ నటుడు మరణం పైన ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి. ఒక ప్రముఖ టీవీ ఛానల్ యజమాని సైతం అచ్యుత్ ను కావాలనే చంపించారని అతనిది సహజ మరణం కాదని కూడా చాలా రూమర్లు వినిపించాయి. అయితే దీనిపైన ఆయన ప్రాణ స్నేహితుడు ప్రదీప్ కొన్ని విషయాలను సైతం తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ..అచ్యుత్ మరణాన్ని దగ్గరుండి చూశాను అతను చనిపోయే రోజు ముందు నేను మాట్లాడాను షూటింగ్ ఉంది అన్నయ్య వెళుతున్నానని చెప్పాడు.. అచ్యుత్ మాట్లాడేటప్పుడు ఆయసపడడం తాను గమనించానని ఏమైందిరా అంత బాగానే ఉన్నావు కదా అని అడగగా అంతా బాగానే ఉందని చెప్పారట. కానీ వాడి శరీరంలో కొలెస్ట్రాల్ చాలా పేరుకుపోయింది.. దీనివల్ల గుండెపోటు వచ్చిందని వాడు చనిపోయిన విషయం నుండి నేను ఏడాది వరకు కోలుకోలేదని తెలియజేశాడు.అచ్యుత్ ఎక్కువగా బాగా తినేవాడని అతని భార్య పిల్లలతో కూడా ఈ మధ్యనే మాట్లాడాను హైదరాబాదులో ఒక పల్లెలో ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఇద్దరు జీవితంలో బాగా స్థిరపడ్డారు.. వారి కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేవని తెలిపా.. ప్రస్తుతం వాళ్ళ అమ్మ పెళ్లికి సంబంధించిన పనులు చూసుకోండి అంటూ తెలిపారు.