కారు డ్రైవర్‌ను నమ్మి ఆస్తినంతా పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్..

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్న లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులో ఆమె కూడా ఒకరు. జయలలిత ఎన్నో ఆశలతో హీరోయిన్ కావాలని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె హీరోయిన్ కాలేకపోయింది. అంతేకాకుండా ఒకానొక సమయంలో లో ఆమెకి సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉంది. అప్పుడే బోల్డ్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది జయలలిత కి. దాంతో నటన పరంగా తన సత్తా చూపించడం కోసం ఆమె గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండే వాంప్ పాత్రలలోనే నటించింది. అలా 100 కి పైగా సినిమా లో బోల్డ్ పాత్రలో, కామెడీ పాత్రలో నటించి అందరిని అల్లరించింది. ఇక ఈ మధ్యకాలంలో అన్ని మంచి పాత్రలో నటిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

ముఖ్యంగ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో జయలలిత స్పీకర్ పాత్రలో కనిపించింది. ఆ తరువాత ఓరి దేవుడా, రంగ మార్తాండ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూ కి హాజరైన జయలలిత తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను అభిమానులతో పంచుకొని బావోద్వేగానికి గురైంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తను 4 కోట్లు ఒక్కరికి ఇచ్చి మోసపోయాను అని చెప్పింది. ఆ సమయంలో ఆమెకి సినీ ఇండస్ట్రీ నుండి ఎవరు సపోర్ట్ కూడా చెయ్యలేదు అంటూ జయలలిత కంట తడి పెట్టుకుంది.

అసలు విషయంలోకి వెళ్తే అనిల్ గణపతి రాజు అనే వ్యక్తి మొదట రాఘవేంద్ర రావు దెగ్గర కార్ డ్రైవర్ గా పనిచేసావాడట . జయలలిత రాఘవేంద్ర రావు దర్శకత్వం లో ఒక సీరియల్ లో నటించే సమయంలో ఆ వ్యక్తి జయలలిత ను రోజు కార్ లో ఇంటిదేగ్గర దిగబెట్టేవాడట. గోరంత దీపం సీరియల్ చేస్తున్నప్పటినుండి జయలలిత కు గణపతి రాజు పరిచయమెనట. అలా అతను వర ముళ్ళపూడి తో కలిసి ‘కుందనపు బొమ్మ ‘ అనే సినిమాకి కూడా పని చేసాడు . కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడం తో బాగా లాస్ వచ్చిందట. అప్పుడు జయలలిత దెగ్గర బాగా డబ్బు ఉండటం చూసి ఆ సినిమా కోసం పని చేసిన వారందరికీ ఆమె దెగ్గర నుండి డబ్బులు ఇప్పించారట కార్ డ్రైవర్ గణపతి రాజు . అలా దాదాపు 4 కోట్లు రూపాయలు ఇచ్చిందట జయలలిత. ఆమె నుండి సహాయం పొంది కూడా ఆమె వెనక తిట్టేవారానికి చెప్తూ జయలలిత కంటతడి పెట్టుకుంది.  దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.