‘ పుష్ప – ది రూల్ తో సింగం అగైన్.. బాక్స్ ఆఫీస్ క్లాష్ లేనట్లేనా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో ఈ మాస్ యాక్షన్ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీని స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా 2024 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

అయితే అదే డేట్ ని ఇప్పటికే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్న… సింగం అగైన్ కోసం లాక్ చేశారు మేకర్స్. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింగం అగైన్ పై అక్కడి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇక మరోవైపు పుష్ప ది రూల్ మూవీపై నార్త్ ఇండియన్స్ లో కూడా భారీ హైప్‌ ఉండటంతో.. రెండిటి మధ్య బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడితే ఒకింత థియేటర్స్ విషయంలో.. సమస్య రావడంతో పాటు రెండు మూవీస్ ఇబ్బందుల్లో పడతాయని తెలుస్తుంది.

ఈ విషయంపై ఆలోచన చేస్తున్న సింగం మేకర్స్.. తమ సినిమాని పుష్ప ది రూల్ తో క్లాష్ లేకుండా మరికొన్నాళ్లు పాటు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే దీనిపై ఆ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన అయితే రావాల్సి ఉంది.