పాన్ ఇండియా సినిమాకి బ్రేక్ ఇచ్చింది అందుకే.. అనుష్క షాకింగ్ కామెంట్స్…

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఈమధ్య కాస్త గ్యాప్ తీసుకుంది. ఇక తాజాగా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అదే ‘మిస్ శెట్టి’ మిస్టర్ పోలిశెట్టి సినిమా. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్ తో యముడు ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పి. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. ఈ సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ తో దుసుకుపోయింది.

అయితే బాహుబలి సినిమా లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించిన హీరోయిన్ నవీన్ పోలిశెట్టి లాంటి హీరోతో నటించడంవళ్ళ అతనికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది అనే చెప్పాలి. అనుష్క శెట్టి పాన్ ఇండియా సినిమా అయిన బాహుబలి 2 సినిమా తరువాత మరే పాన్ ఇండియా సినిమా లో కూడా నటించలేదు. అయితే ఈ విషయం గురించి అనుష్క మొదటిసారి స్పందించింది. బాహుబలి సినిమా తర్వాత 2018లో ‘భాగమతి ‘ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది అనుష్క. ఆ తర్వాత ఓటిటిలో విడుదలైన ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించింది. దాంతో ఫ్యాన్ ఇండియా సినిమాలు ఎందుకు చేయలేదు అని ఆమె అభిమానులు ఆరా తియ్యడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలోనే అనుష్క ఒక ఇంటర్వ్యూ లో అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అనుష్క మాట్లాడుతూ ‘ బాహుబలి సినిమా తరువాత నాకు భాగమతి సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తరువాత నేను సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకున్నాను. ఎందుకంటే భాగమతి సినిమా సమయం లో నాకు అసలు విశ్రాంతి దొరకలేదు. అందుకే ఎలాంటి పెద్ద సినిమా లకు నేను ఓకే చెప్పలేదు. భవిష్యత్తులో మంచి సినిమా తో మీ ముందుకు రావాలంటే నాకు విశ్రాంతి తప్పనిసరి అనిపించింది ‘ అనే పేర్కొన్నారు. అలానే ఇప్పటివరకు ఎలాంటి పాన్ ఇండియా స్టోరీ ని వినలేదని అనుష్క చెప్పారు. మంచి కథ వస్తే కచ్చితంగా పాన్ ఇండియా సినిమా చేస్తా అంటూ ఈ సందర్బంగా ఆమె చెప్పింది. ప్రస్తుతం అనుష్క చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.