ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి మధ్య విభేదాలున్నట్లు గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ ఎన్టీఆర్ ఎటువంటి సందర్భంలో కూడా చెప్పలేదు. ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ మిగిలిన వాటికి దూరంగా ఉంటూ ఉంటారు.
ఎన్టీఆర్ ఇలా తన పని తాను చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఎన్టీఆర్ పైన కొంతమంది కావాలని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయాల విషయానికి వస్తే చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా టిడిపి నాయకులు ఉలిక్కిపడ్డారు. అంతేకాకుండా అభిమానులు పార్టీ నేతలు కూడా చాలా గందరగోళానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఇంత జరుగుతున్న ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. దీంతో కొంతమంది ఎన్టీఆర్ ను చాలా రకాలుగా ట్రోల్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు యాంకర్ శ్యామల ఒక పోస్ట్ షేర్ చేయగ అది వైరల్ గా మారుతోంది.
ఒకసారి నమ్మి మోసపోయాడు రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్నాడు తన నటనతో ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా తన వైపు తిప్పుకునేలా చేస్తున్నాడు అలా ప్రశాంతంగా వదిలేయండి మనకు అనుకూలంగా ఉండే వాళ్ళు బాగు కోరుకుంటాం.. లేకపోతే అంతే అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నా అంటూ ఒక పోస్ట్ షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది. దీంతో కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సపోర్ట్ చేయగా.. మరి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు.
ఒకసారి నమ్మి మోసపోయాడు,
రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్నాడు! తన నటనతో ఇప్పుడిప్పుడే ప్రపంచం చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు.అలా వదిలేయండి అన్నా ప్రశాంతంగా.
మనకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళ బాగు కోరుకుంటాం, లేకపోతే అంతే అనడం ఎంత వరకు సబబు అన్నా!#ChandrababuNaidu#JrNTR https://t.co/L438bOVjuM
— Anchor Shyamala (@AnchorShyamala) September 15, 2023