టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది.. పుష్ప చిత్రంతో మంచి క్రేజీ సంపాదించిన రష్మిక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ లో కూడా రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరుపొందింది.
అయినప్పటికీ ఈ మద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం తగ్గలేదు ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే షాహిద్ కపూర్ తో మరొక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. అలాగే పుష్ప-2 చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించడం జరిగింది.. ఈ క్రమంలోనే వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు తెలియజేసింది రష్మిక.. ఇక నితిన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలలో ఎలాంటి నిజం లేదని విషయాన్ని తెలియజేయడం జరిగింది.
ఇక పెళ్లెప్పుడు చేసుకుంటావని మరొక నేటిజన్ అడగగా ఇప్పుడు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని మ్యారేజ్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలియజేసింది రష్మిక. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ అని అడగగా అప్పటికి ఏది బెటర్ అనిపిస్తే అది చేసుకుంటానంటూ తెలియజేసింది రష్మిక.. ఈ మధ్యకాలంలో రష్మిక నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.