కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.అంతేకాకుండా కొన్ని చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకున్నది.వివాహం తర్వాత వయసు తగ్గిన పాత్రలలో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియమణి ఇటీవలే షారుక్ జవాన్ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించింది.
అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె జవాన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించాను కానీ షారుక్ ఖాన్ టీం లో ఒకరిగా ముఖ్యమైన పాత్ర అని తెలియగానే చాలా ఆనందపడ్డాను.. అట్లీ దర్శకుడు అని చెప్పగానే నటిస్తానని చెప్పేసానని తెలిపింది. అలా ఒకసారి జూమ్ కాల్ లో డైరెక్టర్ అట్లీ ఆర్య మాట్లాడారని తెలిపింది అట్లీ తన మిత్రుడు అని కూడా పరిచయం చేసి ఆర్య వెళ్లిపోయారని అలా ప్రియమణి జవాన్ చిత్రంలో నటిస్తుందని వార్త వెలుపడగానే స్పెషల్ సాంగ్ అయ్యుంటుందని ప్రచారం కూడా జరిగింది.. అయినప్పటికీ తను ఇలాంటివి పట్టించుకోలేదని తెలిపింది.
కానీ డైరెక్టర్ అట్లీ తనను చాలా ఏమార్చారని జవాన్ చిత్రం తమిళ వర్షంలో నటుడు విజయ్ గెస్ట్ రోల్ లో నటించబోతున్నారని తెలుగు వర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరిగిందని నేను అడగగా.. అట్లీ అందుకు సమాధానంగా నటింపజేస్తే పోద్ది అన్నారని అయితే విజయ్ తో తనకు ఒక సినిమాలోనైనా నటింపజేయమని అడగగా అలాగే అన్నారని..అయితే చివరికి డైరెక్టర్ అట్లీ కూడా తనని ఏమార్చుతూనే వచ్చారని తెలిపింది. చివరికి ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ విజయ్ గాని నటించలేదని తెలిపారు ప్రియమణి.