ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న కామెడీ షో అనగానే ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చేది జబర్దస్త్. ఎన్నో ఏళ్ల నుంచి నిరంతరాయంగా మంచి క్రేజ్తో దూసుకుపోతుంది. ఇక ఇటీవల జరిగిన జబర్దస్త్ షోలో యాంకర్ రష్మీ ని ఓ కమీడియన్ టోల్ చేశాడు. 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మి ఒకటి, రెండు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.
తర్వాత యాంకర్ గా మారి తన ఫేట్ మార్చుకుంది. హీరోయిన్గా కూడా అవకాశాలు దక్కించుకుంది. నిన్న మొనటివరకు సినిమాలలో నటించిన రష్మీ ప్రస్తుతం షోలకు మాత్రమే అంకితం అయింది. ఇక తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ రష్మిని చూసేందుకు భోళా శంకర్ సినిమాకి వెళ్లానని ఖర్చీఫ్ పడిపోయిందని వంగి తీసుకునే లోపు రష్మీ సీన్ వచ్చి వెళ్ళిపోయిందని కామెంట్ చేశాడు.
అయితే భాస్కర్ రష్మిని అవమానించిన సరే ఇది సరదాగా కావడంతో రష్మీ లైట్ తీసుకుంది. ఏది ఏమైన నవ్వుతూనే రష్మీ పరువు తీసేసాడు బుల్లెట్ భాస్కర్. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచి నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది.