మళ్లీ వైలెన్స్ కి తెర లేపుతున్న పెదకాపు ట్రైలర్..!!

నారప్ప వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పెద కాపు-1.. ఒక సామాన్యుడు సంతకం అంటూ ఒక ట్యాగ్ లైన్ ని పెట్టడం జరిగింది.. గతంలో ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆ జోనర్ ను వదిలి ఈ మధ్యకాలంలో వైలెన్స్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.పెద కాపు సినిమా మరో కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ సైతం చిత్ర బృందం వేగవంత చేస్తోంది ఈ నేపథ్యంలోనే ట్రైలర్ను సైతం చిత్ర బృందం విడుదల చేశారు..

 

పెద కాపు సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఒక ఆడది నూతిలో పడి ఆకాశం తప్ప ఆదుకునే వాడు లేక అరిస్తే వినిపించుకునే వాడు లేక వెళ్ళిపోయింది.. అనే డైలాగ్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది.. తనికెళ్ల భరణి ఈ డైలాగు చెబుతూ ఉంటారు. పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో కొనసాగుతోంది. ఈ ట్రైలర్ ముఖ్యంగా వైలెన్స్ కూడా భారీగా కనిపిస్తోంది. ముఖ్యంగా హీరో చెప్పే డైలాగులు కూడా ఈ ట్రైలర్లు హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి..

 

ట్రైలర్ చూస్తూ ఉంటే వెనుకబడిన ఆడవారి పైన జరిగే ఘోరాలను టచ్ చేస్తూ ధర్మం అధర్మం సామాన్యుడు పైన అధికార పెత్తనం చూపిస్తే ఎలా ఉంటుంది అనే కథ అంశంతో పెద కాపు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సామాన్యుడు అధికార పెత్తనం మధ్య చివరికి ఎవరు గెలుస్తారా లేదా అనే విషయం తెరపైన చూడాల్సిందే.. ఇందులో హీరోగా విరాట్ కర్ణ నటిస్తూ ఉన్నారు ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.