ఏపీ రాజకీయాలపై సంచలన ట్విట్ చేసిన మంచు లక్ష్మి..!!

తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్రమశిక్షణకు మారుపేరు అంటూ ఎన్నోసార్లు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. మంచు మనోజ్ విష్ణు ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకున్నారు..మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత విలన్ గా నటించిన మెప్పించలేకపోవడంతో పాటు హోస్ట్ గా పలు షోలకు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఫెయిల్యూర్ కావడంతో ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ కనిపించలేదు.

కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ట్వీట్ చేయడంతో మళ్లీ ఇప్పుడు రాజకీయాలలో చర్చనీ అంశముగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి.. కొందరు వీటిపైన స్పందిస్తూ ఉంటే మరి కొంతమంది సెలబ్రిటీలు అక్కడక్కడ జరుగుతున్న వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. తాజాగా మంచు లక్ష్మి ట్వీట్ చేస్తూ ఏపీ రాజకీయాలను చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటూ ఒక ఆసక్తికరమైన ట్విట్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మంచు వారి కుటుంబంలో మోహన్ బాబు కి రాజకీయాలు కొత్తేమి కాదు గతంలో ఆయన ఎంపీగా ఉన్న తర్వాత వైసీపీలోకి జాయిన్ అయ్యారు.. మంచు విష్ణు కూడా జగన్ కు మద్దతుగా ఉన్నారు.. మంచు మనోజ్ భార్య టిడిపి అన్న సంగతి తెలిసిందే మనోజ్ ఇటు టిడిపితో ఉంటూనే అటు పవన్ తో కూడ సన్నిహితంగా ఉంటారు. మంచు లక్ష్మీ మాత్రం ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఎప్పుడు తెలుపలేదు.కానీ ఒకసారిగా ఇలా ట్విట్ చేయడంతో నేటిజన్స్ సైతం మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.