నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన మహాలక్ష్మి..!!

కోలీవుడ్లో ఒకప్పుడు నటి మహాలక్ష్మి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరను వివాహం చేసుకుందో ఒక్కసారిగా ఇమే పాపులారిటీ అయింది. అంత బరువు ఉన్న నిర్మాతను మరి ప్రేమించి ఏరుకోరి రెండో వివాహం చేసుకోవడంతో అందరూ ఆమెను తప్పుపట్టారు. డబ్బు కోసమే ఈమె వివాహం చేసుకుందంటూ వార్తలు వినిపించాయి.. కేవలం ఆస్తి నగలు కోసమే ప్రేమ పేరుతో రవీంద్రనాథ్ వలలో వేసుకుందనే విమర్శలు కూడా చాలానే వినిపించాయి.. అయితే ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా ఆమె వివాహం చేసుకొని ఏడాది పాటు వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేస్తోంది.

ఏడాదిలో రవీందర్ మహాలక్ష్మికి కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చి సడన్ సర్ప్రైజ్డ్ చేశారు.. అయితే ఇప్పుడు తాజాగా రవీందర్ చీటింగ్ కేసులో జైలుకు వెళ్లడం జరిగింది.. తన భర్త జైల్లో ఉన్నాడు అన్న బాధ లేకుండా మహాలక్ష్మి సోషల్ మీడియాలో పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా మహాలక్ష్మి భర్త పైన పలు సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. రవీందర్ తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడని తన సన్నిహితుల ముందు చెప్పినట్లు సమాచారం.

పెళ్లికి ముందు రవీందర్ ఇలాంటి విషయాలు తనకు ఏమి చెప్పలేదని.. చీటింగ్ కేస్లో డబ్బు విషయాలు మా మధ్య అసలు రాలేదు నాకు అబద్దాలు చెప్పి మోసం చేసి వివాహం చేసుకున్నారంటూ తెలియజేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈమె అభిమానులు ఈమె చేసిన వాక్యాల పైన ఫైర్ అవుతున్నారు డబ్బు ఉన్నంతకాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడు రవీందర్ జైల్లో ఉంటే మోసం చేశారని చెప్పడం సజావు కాదంటూ డబ్బు కోసమే పెళ్లి చేసుకుందంటూ పలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.