మంచు ఫ్యామిలీలో విభేదాలు..రాఖీ కట్టని మంచు లక్ష్మి..!!

మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి.. కానీ మంచి కుటుంబ సభ్యులు మాత్రం అదంతా ఏమీ లేదని మేమంతా బాగానే ఉన్నామని తెలియజేస్తూ ఉంటారు.. అయినప్పటికీ ఈ రూమర్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఈ ఫోటో చూసిన వారంతా అసలు మ్యాటర్ ఏంటని ఆరా తీయడం మొదలుపెట్టారు.

అప్పట్లో మంచు విష్ణు, మనోజ్ అనుచరుడితో వాగ్వాదానికి దిగిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది.. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి.. అందుకు తగ్గట్టుగానే మనోజ్ పెళ్లిలో విష్ణు కుటుంబం కూడా పెద్దగా సందడి చేయకపోవడంతో ఈ విషయం నిజమేనని కన్ఫామ్ కూడా అయిపోయారు ప్రేక్షకులు.. అయితే మంచు లక్ష్మి మాత్రం తన తమ్ముడికి పెళ్లిని దగ్గరుండి మరి అంగరంగ వైభవంగా జరిపింది. ఈ సంఘటన చూసిన వారంతా మంచు ఫ్యామిలీలో సఖ్యత లోపించిందని అనుమానాలు మొదలయ్యాయి.

తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటో కూడా మరొకసారి ఇలాంటి చర్చలకు దారితీస్తోంది.. రాఖీ పండుగ సందర్భంగా మంచు లక్ష్మి సోదరుడు మనోజ్ కు రాఖీ కట్టి వారితో రెస్టారెంట్ కి భోజనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రాంలో షేర్ చేసి ప్రేమతో సరదాగా సమయాన్ని గడిపేందుకు రుచికరమైన భోజనం చేసి రాఖీ పండుగను సెలబ్రేషన్ చేసుకున్నాను అంటూ ఒక క్యాప్షన్ ని రాసుకురావడం జరిగింది. అయితే ఈ ఫోటోలు పెద్ద తమ్ముడు మంచు విష్ణు కనిపించలేదు.. దీంతో పలువురు నెటిజన్లు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మళ్లీ అక్క తమ్ముళ్ల మధ్య విభేదాలు వచ్చాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఎవరు స్పందిస్తారో చూడాలి.