” నువ్వే కావాలి ” సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హిట్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది రీచా ఫలోడ్ ఈ పేరు చెప్తే టక్కున గుర్తుకు రావడం కష్టం కానీ నువ్వే కావాలి సినిమా హీరోయిన్ అంటే మాత్రం గుర్తుపడతారు. ఈ బ్యూటీ అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 1980 ఆగస్టు 30న పుట్టిన ఈ ముద్దుగుమ్మ 1991లో ఓ బాలీవుడ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆమె నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పట్లో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది.

తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అందంతోపాటు, అభినయం కూడా ఉన్న ఈ నటి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈమె తెలుగులో నువ్వే కావాలి, చిరుజల్లు, ప్రేమతో రా, హోలీ నా, మనసిస్తారా లాంటి ఎన్నో సినిమాలను నటించి ప్రేక్షకులను మెప్పించింది. చివరిగా మలుపు సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ తర్వాత టాలీవుడ్ లో ఎటువంటి సినిమాలు నటించలేదు. సినిమాల్లో రాణిస్తున్న టైం లో ప్రముఖ వ్యాపారవేత హిమాన్షు బజాజ్‌ని వివాహం చేసుకుంది.

త‌ర్వాత ఈ ముద్దుగుమ్మ పిల్లలు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ సినిమాలకు దూరమైంది. నువ్వే కావాలి సినిమాతో ఈ అమ్మడుకు క్రేజ్ బాగా పెరిగింది అయినా పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో చిన్ని చిన్ని సినిమాల్లో నటించింది. ఇక చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ 2016లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్ర‌స్తుతం కుటుంబ భాద్య‌త‌టు చూసుకుంటున్న ఈ బ్యూటి సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.