బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్‌ లీక్.. షకీలాకి ఎంత అంటే…

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో తక్కువ సమయంలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది ఈ షో. 14 మంది కాంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 3 న  ప్రారంభంఅయింది బిగ్ బాస్ సీజన్ 7.  అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా లో ఈసారి కంటెస్టెంట్స్ గా సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజీ, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభశ్రీ, నటి షకీలా , కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి,యూట్యూబర్ టేస్టీ తేజ,నటుడు గౌతమ్ కృష్ణ, నటి రతికా రోజ్, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్ దీప్ లు ఉన్నారు.

ఈ సీజన్ దాదాపుగా 20 వారలు పాటు ప్రసారం కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.అయితే బిగ్ బాస్ షోలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్ ఎవరనే ప్రశ్న అందరిలో మొదలైంది. అసలు సీనియర్ నటి షకీలా రెమ్యూనయేషన్ ఎంత అనే సందేహం కూడా చాలామంది లో ఉంది. బిబి సీజన్ 7 లో ఎవరెవరు ఎంతేంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేదాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా సీనియర్ నటుడు శివాజి పారితోషకం గురించి మట్కాడుకుంటే బిగ్ బాస్ వారు అతనికి వారానికి ఏకంగా 4 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సమాచారం. ఈసారి హౌస్ అదే బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది.

మరో కంటెస్టెంట్ షకీలా కు వారానికి 3.5 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ అందుతోందని సమాచారం. ఇక కిరణ్ రాథోడ్ కి రూ. 3 లక్షలు, ఆట సందీప్ కి రూ. 2.75 లక్షలు, ప్రియాంక కి రూ. 2.5 లక్షలు, దామిని, రతికా రోజ్ రూ. 2 లక్షలు, శోభా శెట్టి రూ. 2.25 లక్షలు, అమర్ దీప్ రూ. 2.5 లక్షలు,ప్రిన్స్ యావర్ రూ. 1.5 లక్షలు, పల్లవి ప్రశాంత్ కి మాత్రం వారానికి కేవలం లక్ష రూపాయల పారితోషికం అందుతోందని సమాచారం. ఇక బిగ్ బాస్ షో ని హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున కి దాదాపు 10 కోట్ల వరకూ పారితోషకం దక్కుతుందట.బిగ్ బాస్ సీజన్7 ఊహించని ట్విస్టులతో ఉండనుందని సమాచారం. కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్లు ఇలా ఉండగా టైటిల్ గెలిచినా వారికీ రూ. 50 లక్షల ప్రైస్ మనీ ఉంటుంది.