టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తన కెరియర్ను కొనసాగించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఈమె క్రేజ్ నిలుపుకోలేకపోయింది. సడన్గా సినిమాలకు బ్రేక్ తీసుకున్న అనుష్క బాహుబలి-2 తర్వాత కేవలం నిశ్శబ్దం భాగమతి వంటి చిత్రాలలో నటించింది.
ఆ తర్వాత మళ్లీ మూడేళ్ల గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.. అయితే బాహుబలి సినిమా తర్వాత ఎందుకు గ్యాప్ తీసుకోవలసి వచ్చింది అనే విషయం పైన అనుష్క మాట్లాడుతూ బాహుబలి సినిమా పూర్తయ్యాక ముందుగా అంగీకరించిన చిత్రం భాగమతి.. సినిమా పనులు ముగించుకొని కాస్త బ్రేక్ తీసుకున్నాను ఆ తర్వాత కొన్నేళ్లుగా ఏ సినిమా కథ కూడా వినలేదు.. దీంతో సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యానని తెలిపింది అనుష్క.
బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత సద్వినియోగం చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.. కానీ అది నాకు అవసరం లేదు నా కెరియర్ కు బ్రేక్ అవసరం కాబట్టి నేను విరామం తీసుకున్నానని ఆ తర్వాత మళ్లీ నటించాలనుకున్నప్పుడే నిశ్శబ్దం సినిమాలో నటించాను మళ్లీ ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించాలనుకున్నాను అని తెలిపింది.. కథను వింటాను మంచి కథ కుదిరితే ఏ భారతీయ సినిమాలోనైనా నటించడానికి సిద్ధమే అంటూ తెలిపింది అనుష్క శెట్టి.