మంచు మోహన్ బాబు మళ్ళీ దొరికేసాడు… ప్లెక్సీ మీద విపరీతమైన ట్రోల్స్?

మంచు వారి ఫామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, నటుడు, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎప్పుడుబడితే అప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ ఫామిలీ మీద వచ్చినన్ని ట్రోల్స్ మరే ఫామిలీ మీద రావంటే మీరు నమ్ముతారా? ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు కావచ్చు, ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడం, ఆ మధ్యన విడుదలైన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ అడ్వాన్స్ కలెక్షన్స్… ప్రతి అంశంలోనూ మంచుఫ్యామిలీ ట్రోల్స్ లో గురైంది.

‘సన్ ఆఫ్ ఇండియా’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇద్దరు హీరోలు కావాలని ట్రోల్స్ చేయిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కాగా తాజాగా మోహన్ బాబు మరోసారి ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ అయిపోయాడు. తాజాగా విద్యానికేతన్‌లో తెలుగు భాషాదినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మోహన్ బాబు ఫోటోతో కలిపి తెలుగు భాషా దినోత్సవం సెలెబ్రేషన్స్ అని రాసి ఓ హోర్డింగ్ పెట్టారు. ఇక్కడ కామెడీ ఏంటంటే.. తెలుగు భాషా దినోత్సవం అని తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో రాసి పెట్టడం. దాంతో జనాలు వారిమీద రెచ్చిపోయి మరీ ట్రోల్స్ మొదలెట్టేసారు.

తెలుగు భాషా దినోత్సవం అని చెప్పి.. అంతా ఇంగ్లీష్ లోనే పెట్టారు కదా? ఇదెక్కడి కామెడీ అంటూ కామెంట్లు మీద కామెంట్స్ చేస్తున్నారు నెటిజనం. కావాలంటే ఇక్కడ ఫోటో చూడండి, మీకే అర్ధం అవుతుంది. సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్లలో తన పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై మోహన్ బాబు మాట్లాడిన సంగతి విదితమే. సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ని తెలిసిన వాళ్లు తనకు పంపిస్తుంటారని తెలిపారు. ఒక్కోసారి వాటిని చూసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది అని ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ట్రోల్స్‌ అంటే నవ్వించేలా ఉండాలి కానీ, అసభ్యకరంగా ఉండకూడదన్నారు. ఏది ఏమైనా విమర్శలు అనేవి వారికి పరిపాటి అయిపోయినట్టు కనిపిస్తోంది.