చిరంజీవి పూజ గదిలో ఎవరి ఫోటో ఉందో తెలిస్తే షాక్..!!

మెగాస్టార్ చిరంజీవి తన మామయ్య అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు..ఇక తన మామయ్య అల్లు రామలింగయ్య అంటే ఎంతో గౌరవము. తాజాగా చిరంజీవి పూజ గదికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పూజ గదిలో దేవతల ప్రతిమలు చిత్రపటాలతో పాటు అల్లు రామలింగయ్య ఫోటో ఉండడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Image

అయితే చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు ఫోటో కూడా పూజ గదిలో ఉన్నది.. కానీ ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోకుండా కేవలం అల్లు రామలింగయ్య ఫోటోను మాత్రమే ఎక్కువగా వైరల్ చేస్తున్నారు.. ఎందుకంటే తనకు పిల్లనిచ్చిన మామ ఫోటోను దేవుడు గదిలో పెట్టి పూజించడంతో చిరంజీవి గొప్ప మనసు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.. ఈ రోజున రక్షాబంధన్ సందర్భంగా చిరంజీవి ఇద్దరు చెల్లెలు మాధవి విజయ దుర్గ చిరంజీవి ఇంటికెళ్లి మరి రాఖీలు కట్టడం జరిగింది.

Image

చిరంజీవి చెల్లెలను ఆశీర్వదిస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు పంచుకోవడంతో పూజ గదిలో చెల్లెలు రాఖి కట్టినట్టుగా ఈ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతోంది. అల్లు రామలింగయ్య ఫోటో చూసి చిరంజీవి పెద్దలకు ఇచ్చే గౌరవం ఇదే అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. పెద్దలను కూడా చిరంజీవి దైవంగా భావించి పూజించడం కేవలం అది చిరంజీవికి మాత్రమే సాధ్యమంటూ కొనియాడుతున్నారు. ఇండస్ట్రీలో ఎదగడానికి అల్లు రామలింగయ్య చిరంజీవిని ప్రోత్సహించాడు అని కూడా చెప్పవచ్చు అందుకే తన మామయ్య అంటే చిరంజీవికి చాలా గౌరవం అని ఎన్నోసార్లు చెబుతూ ఉండేవారు.