కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం ఉండదు.. ఎప్పుడు కూడా సంచలన వివాదాస్పదమైన నటిగా ముద్ర వేసుకుంది.. ఈ ముద్దుగుమ్మ మైన చిత్రంతో మొదటిసారి కోలీవుడ్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ ఆ తర్వాత ఎన్నో వరుస చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది.. స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న ధనుష్, విజయ్ వంటి హీరోలతో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ లో కూడా అంతే పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
నటిగా కెరియర్ పీక్స్ లో ఉండగానే డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది అమలాపాల్.. అయితే రెండేళ్లలోపు మనస్పర్ధలు రావడంతో వీరి మధ్య విభేదాలు వచ్చి విడాకులకు దారితీసింది.. అమలాపాల్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే మైనా సినిమా తర్వాత తను చాలా మానసిక వేదనకు గురైందని జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించబడ్డాననే చెప్పాలనుకున్నానని తెలియజేసింది.. కరోనా సమయంలో దాదాపుగా రెండేళ్ల పాటు ఇంట్లోనే కూర్చొని తన గురించి తను చాలా ఆలోచిస్తూ ఆవేదనకు గురయ్యానని తెలిపినట్టు తెలుస్తోంది.
ఇక తనను చూసి తనకంటే ఎక్కువగా తన తల్లి బాధపడిందని తనకు మార్గదర్శి అంటూ ఎవరూ లేరని ఒకవేళ అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే తాను కూడా అందరిలాగా ఆనందంగా ఉండేదాన్నేమో అంటూ తెలియజేసింది అమలాపాల్.. ఆ మధ్య నిర్మాతగా కూడా మారి అమలాపాల్ పలు సినిమాలను తెరకెక్కించింది ప్రస్తుతం మాతృభాషలో మూడు సినిమాలలో నటిస్తోంది. ఏది ఏమైనా అమలాపాల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.