భార్యకు అబార్షన్ అయితే అలాంటి మాటలు తారక్ మాట్లాడాడు: స్టార్ యాక్టర్

స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన సన్నిహితుల విషయం లో మాత్రం చాలా కేరింగ్ గా ఉంటాడు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలో నటుడు ప్రభాస్ శ్రీను కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆ రకంగా ప్రభాస్ శ్రీను, ఎన్టీఆర్ మంచి స్నేహితులు అయ్యారు.

ఇటీవల ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్టీఆర్ కి సంబందించిన కొన్ని విషయాలను బయట పెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ శ్రీను, ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ ‘ నా భార్య కు అబార్షన్ జరిగిన సమయంలో ఎన్టీఆర్ నాకు కాల్ చేసి నువ్వేం టెన్షన్ పడకు అని నాకు ధైర్యం చెప్పారు ‘ అని ప్రభాస్ శ్రీను చెప్పాడు. ‘ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న యమదొంగ సినిమా లో నేను కూడా నటించాను. ఆ టైమ్ లోనే ఇలా జరిగింది. అప్పుడు నాకు ఇండస్ట్రీ లో పెద్దగా గుర్తింపు కూడా లేదు. అయినప్పటికి ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసి ఇవ్వని కామన్ అని, నెక్స్ట్ టైమ్ నీకు నాలాంటోడు పుడతాడు అని ధైర్యం చెప్పారు ‘ అని  ప్రభాస్ శ్రీను వెల్లడించారు.

అంతేకాకుండా ఎన్టీఆర్, ప్రభాస్ శ్రీను ని బయట ప్రదేశాలకు ఎక్కడికైనా వెళ్తావా టికెట్స్ కి నేను డబ్బులు ఇస్తాను అని కూడా అన్నారట. ఒకసారి ఎన్టీఆర్ కి పరిచయం అయితే మనుషులను అంతగా ప్రేమిస్తారు అని ప్రభాస్ శ్రీను ఎన్టీఆర్ గొప్పతనం గురించి వివరించాడు. ఆయనతో పరిచయం ఉన్నవాళ్లకి మాత్రమే ఆయన గొప్పతనం తెలుస్తుంది అని శ్రీను చెప్పాడు. అంతేకాకుండా ఆయన ఎంతో రుచికరంగ వంట చేస్తారని శ్రీను కామెంట్ చేసాడు.  ప్రభాస్ శ్రీను చెప్పిన మాటలు విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి గా ఫీల్ అవుతున్నారు.