చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమంత.. ఖుషి కి దూరం.. మేకర్స్ షాకింగ్ నిర్ణయం…

ప్రముఖ నటి సమంత అమెరికాకు బయలుదేరింది. మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవడం కోసం కొన్ని వారలు అక్కడే ఉండి చికిత్స తీసుకోబోతుందని సమాచారం. గత రెండేళ్లుగా సమంతా కు సంబంధించిన ఎలాంటి చిన్న విషయమైనా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో నాలుగేళ్లు బాగానే కాపురం చేసింది. ఏమైందో ఏమో తెలీదు కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకొని విడిపోయారు.

ఆ తర్వాత కొంతకాలానికి సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళింది. కాస్త కోలుకోగానే ఇండియా తిరిగి వచ్చి శాకుంతలం, యశోద షూటింగ్ లో పాల్గొంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమా లో నటిస్తుంది. మంచి బజ్ సొంతం చేసుకున్న ఖుషి సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రాభోతుంది. ఇదిలా ఉండగా సమంత మాత్రం మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోలేదు. దాంతో సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూనే యోగా లాంటి సహజసిద్ధమైన పద్ధతులను పాటిస్తుంది. అయితే ఖుషి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమె సినిమాల నుండి ఏడాది వరకు బ్రేక్ తీసుకుందట.

సామ్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ఓకే చేయకూడదు అని నిర్ణయించుకుందట. ఆ ట్రీట్మెంట్ కోసమే సమంత శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుండి న్యూయార్క్ వెళ్ళింది. చికిత్స కోసం సమంత న్యూయార్క్ వెళ్లడం వల్ల ఇకనుండి ఖుషి ప్రమోషన్స్ లో ఆమె కనిపించదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సమంత ఉండగానే ఉద్దేశంతోటి ఆ చిత్ర నిర్మాతలు ముందుగానే మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ ఈవెంట్ లో సమంత విజయ్ డాన్స్ లు హంగామా ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. పైకి ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ లో లోపల వ్యాధి కారణంగా బాధపడుతూనే ఉంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘ఆరోగ్యంగా తిరిగి వస్తాను మీ కోసం బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తాను’ అంటూ ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసింది. సమంత పూర్తిగా కోలుకొని తిరిగి రావాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు.