న‌మ‌త్ర‌కు మ‌హేష్ బాబు ఇచ్చిన ఫ‌స్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా.. అస్సలు గెస్ చేయ‌లేరు!

టాలీవుడ్ లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఒక‌టి. దాదాపు ఐదేళ్ల పాటు ర‌హ‌స్యంగా ప్రేమించుకుని.. 2005లో ఇరుకుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత మ‌హేష్ బాబు స్టార్ అయ్యాడు. మ‌రోవైపు న‌మ్ర‌త మాత్రం సినిమాలు వ‌దిలేసింది. అప్ప‌టికే ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతోంది.

పెళ్లి త‌ర్వాత కూడా ఆమెకు ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ, న‌మ్ర‌త న‌ట‌న‌కు పులిస్టాప్ పెట్టి సంపూర్ణ గృహిణిగా మారింది. గౌత‌మ్‌, సితార అనే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి.. భ‌ర్త‌, పిల్ల‌ల పూర్తి బాధ్య‌త‌లను తీసుకుంది. అలాగే మ‌హేష్ బాబు వ్యాపార వ్య‌వ‌హారాల‌ను కూడా చుసుకుంటూ.. భ‌ర్త‌కు చేదోడు వాదోడు నిలుస్తోంది. అయితే తాజాగా న‌మ్ర‌త ఓ జ్యువెల‌రీ షాప్ ఓపెనింగ్ లో సంద‌డి చేసింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో కాసేపు ముచ్చ‌టించింది.

ఈ క్ర‌మంలోనే మ‌హేష్ బాబు త‌న‌కు ఇచ్చిన ఫ‌స్ట్ గిఫ్ట్ ఏంటో న‌మ‌త్ర వెల్ల‌డించింది. న‌గ‌లంటే త‌న‌కు పెద్దగా ఇష్టం ఉండ‌ద‌ని.. అయితే మ‌హేష్ త‌న‌కు వెడ్డింగ్ రింగ్ ఫ‌స్ట్ గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ని న‌మ్ర‌త పేర్కొంది. తాను ఇప్పుటి వ‌ర‌కు అందుకున్న ఉత్త‌మ‌మైన బ‌హుబ‌తుల్లో అది ఒక‌టి అని.. అలాగే 8 ఏళ్ల వ‌య‌సులో అమ్మ ఇచ్చిన గోల్డెన్ రింగ్ కూడా త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని న‌మ్ర‌త చెప్పుకొచ్చింది. ఇక రీఎంట్రీ గురించి న‌మ్ర‌త ఓపెన్ అయింది. మ‌హేష్ తో మ‌ళ్లీ తాను న‌టిస్తున్నాని వార్త‌లు వస్తున్నాయి.. అవి ఏ మాత్రం నిజం కాద‌ని న‌మ్ర‌త స్ప‌ష్టం చేసింది.