జూ. ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?

నేటితరం హీరోలలో మాస్ హీరో అనే పదం చెప్పగానే ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. చిన్న వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు.

అయితే స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. దీనిని ఎక్కువ కాలం హ్యాండిల్ చేయలేకపోయారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వరుసగా డిజాస్టర్లు మూట కట్టుకున్నాయి.. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని కూడా చెప్పవచ్చు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా సమయంలో అతని లుక్స్ చూసి జనాలు ఆయన సినిమాలను చూడడమే మానేశారట. ఈ విషయం స్వయంగా ఎన్టీఆర్ చప్పడం జరిగింది.. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి సలహాలు పాటిస్తూ లైపో సర్జరీ చేసుకోవడం ఎన్టీఆర్ సన్నగా అయిపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అప్పటినుంచి ఎన్టీఆర్ ని సరికొత్తగా చూడడం జరిగింది.. నటనపరంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి బెస్ట్ యాక్టర్ ఎవరంటే కచ్చితంగా ఎన్టీఆర్ పేరే చెబుతారు.. కానీ మహేష్ ,అల్లు అర్జున్ ,రామ్ చరణ్ కి ఉన్నన్ని అవార్డ్స్ ఎన్టీఆర్కు మాత్రం లేవు..RRR చిత్రానికి నేషనల్ అవార్డుకి నామినేట్ అయ్యాడు కానీ ఆ అవార్డు మాత్రం రాలేదు. దీనిపై కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. నటన గురించి అందరూ చాలా గొప్పలు చెబుతారు కానీ అవార్డులు లేవు.. పోనీ బాక్సాఫీస్ వద్ద రికార్డు చూద్దాము అంటే సింహాద్రి సినిమా తర్వాత ఇండస్ట్రీని షేక్ చేసి ఒక హిట్టు కూడా పడలేదు..RRR చిత్రానికి మూడేళ్లు కేటాయించిన పాపులారిటీ అంతా రామ్ చరణ్ కి వెళ్లిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో తన సమయం అంత వృధా అయ్యిందని పలువురు అభిమానులు తమను ఎందుకు టార్చర్ చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ మరి తమలో ఉన్న కోపాన్ని తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.