శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ త్వరలోనే ఎన్టీఆర్ ‘దేవర” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడతాయని అనడంలో సందేహం లేదు. చాలా హాట్ గా ఉండే జాన్వీ కపూర్ అభిమానులను నిత్యం కొత్త ఫోటోలతో ఆకట్టుకుంటుంది. హార్ట్ డోస్ పెంచుతూ కుర్రాళ్లకు మతిపోగొడుతుంది. ఈ అందాల భామ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఆ సమయంలో చీరలో చాలా అందంగా, పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలా మనసులు దోచేసింది.
తరువాత పాతకాలం నాటి పెయింటింగ్ లో కనిపించే యువతుల వలె సరికొత్త అవతారంలో దర్శనమిచ్చింది దానికి సంబంధించిన ఫోటో షూట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో ఈ ముద్దుగుమ్మ ఒక శారీ లాంటి ఔట్ఫిట్లో చాలా క్యూట్గా మెరిసింది. ఈ అందాల తార వింటేజ్ లుక్ చాలామంది అభిమానులకు బాగా నచ్చేసింది.
జాన్వీ కపూర్ బ్లౌజ్ లేకుండా గులాబీ రంగు చీరను ధరించి, ఆనాటి సాంప్రదాయ ఫ్యాషన్ను అందరికీ గుర్తు చేసింది. ఆమె తన జుట్టుకు లేత గులాబీ పెదవి రంగు గల గులాబీ పువ్వులను కూడా జోడించింది. ఆమె జుట్టు పొడవుగా, ఉంగరాలగా ఉంటూ ఓల్డ్ ఏజ్ నాటి నటిలా క్లాసీగా ఉంది. ఈ బ్యూటీ కళ్ళు న్యూడ్ ఐ షాడో, హాట్ కనుబొమ్మలు, మాస్కరాతో అందర్నీ మాయతో కట్టిపడేసాయి.
View this post on Instagram
లేలేత పరవాలు ఆరబోయడంలోనే కాకుండా అల్ట్రా ఫ్యాషన్ డ్రెస్సులు, వెరైటీ ఔట్ఫిట్స్లో మెరవడం ఈ ముద్దుగుమ్మకు కొత్త ఏం కాదు. ఈ తార తన నటనాభినయంతో తెలుగు ప్రేక్షకులను తన తల్లి శ్రీదేవి వలె ఆకట్టుకోగలుగుతుందో లేదో చూడాలి.