ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్..కట్ చేస్తే..!

జబర్దస్త్ కామెడీయన్ గా బుల్లితెరపై మంచి పాపులారిటీ అందుకున్న ఎంతోమంది కమెడియన్లలో కమెడియన్ నవ సందీప్ కూడా ఒకరు. ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా పాల్గొంటూ జానపద గాత్రంతో సింగర్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే తాజాగా మధుర నగర్లో ఈ జబర్దస్త్ కమెడియన్ పైన కేసు నమోదు అయింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ప్రముఖ కమెడియన్ నవ సందీప్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువతిని మోసం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో నవ సందీప్ పైన పోలీసులు పలు రకాల సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి పేరుతో తనని నమ్మించి మోసం చేశారని ఆ యువతి తెలియజేస్తోంది.. అతని మాటలు నమ్మానని కానీ ఇప్పుడు మోహన్ చాటేస్తూ ఉండడంతో మోసపోయానని తెలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుపుతోంది. పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటే తప్పించుకొని తిరుగుతున్నాడని ఆమె ఫిర్యాదులు తెలియజేసినట్టు సమాచారం. అందుకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తును కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.

నవ సందీప్ కమెడియన్ గా కాకుండా సింగర్ గా కూడా జబర్దస్త్ లో బాగానే పాపులారిటీ సంపాదించారు. గతంలో కూడా మాటీవీలో ప్రసారమయ్యేటువంటి అదిరింది షోలో కూడా బాగానే ఆకట్టుకున్నారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా జానపద పాటలతో బాగానే అలరించారు. ఎంతో టాలెంట్ ఉన్న నవ సందీప్ బుద్ధిగా కనిపిస్తూ ఇలా అమ్మాయిని మోసం చేయడంతో పలు రకాలుగా ఈ కమెడియన్ పైన విమర్శలు చేస్తున్నారు నేటిజన్స్.