స్టార్ హీరో కూతుర్ల మధ్య విభేదాలా.. అసలేం జరిగిందంటే..?

టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూతుర్లు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ అక్క చెల్లెలు చూడడానికి చాలా అందంగా సాంప్రదాయంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు పలు రకాల ఫంక్షన్స్ కు పార్టీలకు వెళుతూ ఉంటారు. చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్లుగా నటించిన పెద్దగా స్టార్ స్టేటస్ ని అందుకోలేక పోతున్నారు.

అయితే అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయని చెప్పవచ్చు.. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.. మొత్తానికి ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఒకే స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. టాలెంట్ విషయంలో మాత్రం ఒకరిని మించి మరొకరు చూపిస్తూ ఉంటూ ఇండస్ట్రీలో పోటీపడుతూ హడావిడి చేస్తూ ఉంటారు. అయితే తాజాగా శివాత్మిక చేసిన కొన్ని పనులు అవ్వాలి వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

అదేమిటంటే శివాని రాజశేఖర్ నటించిన జిలేబి సినిమా రిలీజ్ అయింది.ఈ సినిమాతో పాటు ప్రేమ్ కుమార్ అనే సినిమా కూడా విడుదలయ్యింది.. సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ సినిమా గురించి శివాత్మిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.. అయితే తన అక్క నటించిన జిలేబి సినిమా గురించి ఏ విధంగా పట్టించుకోలేదు.. దీంతో అక్క చెల్లెల మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా అనే అనుమానాలు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ప్రేమ్ కుమార్ సినిమా ఫోటో తీసి బాగా వైరల్ గా మారుతున్నప్పటికీ శివాత్మిక చేసిన పనికి జనాలు ఫైర్ అవుతున్నారు. మరి విభేదాల వార్తలపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి..