రష్మీ- సుధీర్ లవ్ పై ఓపెన్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది..!!

తెలుగు బుల్లితెర ఫేమస్ ఆర్టిస్టులలో సుదీర్, రష్మీ జంట కూడా ఒకరు.. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి షోలలో సందడి చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా వీరి రొమాన్స్ తో మంచి పాపులారిటీ దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే వార్తలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. మొదటిసారిగా జబర్దస్త్ షో నుంచి పరిచయమైన సుధీర్ రష్మి ఆ తర్వాత యాంకర్ గా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. సుధీర్ యాంకర్ గా కమెడియన్ గా హీరోగా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

రష్మీ కూడా హీరోయిన్గా యాంకర్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది. వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూస్తే నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారని అనుమానాలు రాక తప్పదు.. అయితే వీళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని టాక్ వినిపిస్తూ ఉంటుంది.. గతంలో బుల్లితెర వేదిక మీద వీరి పెళ్లికూడా చేసుకోవడం జరిగింది. మల్లె మాల ప్రొడక్షన్ వారు ఎన్నో సార్లు వీరి మధ్య ప్రపోజల్ సన్నివేశాలను కూడా చూపించడం జరిగింది.

దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఈ జంటను ఒక్కటిగా చూడాలని కోరుకోవడం జరిగింది. అయితే సుధీర్ బుల్లితెరకు గుడ్ బై చెప్పడంతో రష్మీ -సుధీర్ మధ్య కాస్త గ్యాప్ పెరిగిపోయింది. అయితే మళ్లీ ఇన్ని రోజులకు ఈ జంట అభిమానుల కోరిక తీర్చింది.తాజాగా ఈటీవీ 28 ఇయర్స్ స్పెషల్ సందర్భంగా బలగం షోని ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో యాంకర్ గారు రష్మి ,సుధీర్ కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ప్రోమో చివరలో హైపర్ ఆది రష్మి ,సుధీర్ వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ 9 ఏళ్ల నుంచి ఉంది ఎలా ఉంది అని అడగగా.. వెంటనే బ్యాగ్రౌండ్ లో కుర్చీలు మడత పెట్టి అనే బూతు పదం వచ్చే డైలాగ్ దీంతో అక్కడున్న వారంతా డైలాగ్ విని పరిచారు సుధీర్ రష్మి మాత్రం సిగ్గుపడితే కనిపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.