వేశ్య పాత్రలో కూడా అదుర్స్ అనిపించిన హీరోయిన్స్..!!

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే సినిమాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది కాదు.. అలాంటి సమయంలో కొన్ని పాత్రలు చేయాలంటే కాస్త ఇబ్బంది పడేవారు.. కానీ ప్రస్తుతం ఉన్న రోజులు పూర్తిగా మారిపోయాయి సినిమా అంటే అందరికీ అవగాహన వచ్చేసిందని చెప్పవచ్చు. హీరోయిన్లు కూడా ఎలాంటి పాత్రలోనైనా చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.. మంచి క్యారెక్టర్ అయితే చిన్న రోల్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమాజంలో వేశ్యలు అంటే చిన్న చూపు ఉంటుంది. అయితే వీరి గురించి కూడా కొన్ని సినిమాలు రావడం జరిగింది.

అలా వేశ్య గా నటించాలంటే ముందు ఏ హీరోయిన్ కూడా ముందుకు వచ్చేవారు కాదు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి పాత్రలలో ప్రాధాన్యం ఉంటే కచ్చితంగా వాటిలో నటించడానికి సిద్ధమయ్యారు. అలా కెరియర్ ఫిక్స్ టైంలో స్టార్ హీరోయిన్ అనుష్క కూడా వేదం సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. ఇప్పుడు తాజాగా అనసూయ కూడా ఇలాంటి క్యారెక్టర్లలో ఎక్కువగా నటిస్తోంది. మరొక హీరోయిన్స్ శ్రేయ కూడా పవిత్ర అనే చిత్రంలో వేశ్యపాత్రలో నటించి అదరగొట్టేసింది.

కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కూడా డిడే అనే చిత్రంలో వేష పాత్రలు నటించింది ఇందులో ఇమే పాకిస్తాన్ కు చెందిన వేషగా నటించింది. హీరోయిన్ రమ్యకృష్ణ కూడా సూపర్ డీలక్స్ అనే చిత్రంలో రమ్యకృష్ణ నటన చూసి అందరూ షాక్ అయ్యారు. ఇందులో ఈమె వేశ్యపాత్రలో నటించినట్లు తెలుస్తోంది. మరొక హీరోయిన్ సంగీత ధనం అనే చిత్రంలో ఈమె వేశ్యగా నటించింది. ఛార్మి కూడా జ్యోతిలక్ష్మి సినిమాలో వేశ్యపాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. స్నేహ కూడా ధూల్పేట అనే చిత్రంలో వేశ్య పాత్రలో నటించింది. సదా టార్చ్ లైట్ అనే చిత్రంలో నటించింది. బిందు మాధవి కూడా సెగ అనే చిత్రంలో వేశ్యగా నటించింది.