సమంతాకి మరో కష్టం.. పగవాడికి కూడా రాకూడదు అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్…

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మయా చేసావే’ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది ఈ అమ్మడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించ్చి అభిమానులను అల్లరించింది. తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఇటీవల మాయొసైటీస్ అనే వ్యాధి బారిన పడి కోలుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

తెలుగు, తమిళం, హిందీ భాషలో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా రాజ్యం ఏలుతున్న ఈ చిన్నదనికి వివాహ జీవితం మాత్రం అచ్చిరాలేదనే చెప్పాలి. అక్కినేని నాగచైతన్య ని ప్రేమ వివాహం చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసిందో లేదో అనుకోని కారణాల వాళ్ళ ఇద్దరి మధ్య కలహాలు వచ్చి విడిపోయ్యారు. ఇక నాగచైతన్య తో విడిపోయిన తరువాత సమంత మాయొసైటీస్ వ్యాధితో బాధపడింది. ఆ వ్యాధి చికిత్స కోసం కొన్ని రోజులు విదేశాలకూ వెళ్ళింది. దాంతో కొంతకాలం సినిమా లకు దూరంగా ఉంది సామ్. అయితే ఆ వ్యాధి నుండి సమంత పూర్తి కోలుకోలేదు. అందుకే మళ్లీ చికిత్స కోసం విదేశాలకు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. దాంతో మరోసారి సినిమాలకు దూరం కాభోతుంది అని సమాచారం.

ఇదిలా ఉండగా సమంత వైవాహిక జీవితానికి సంబందించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు అయ్యో పాపం సమంత, నీకు వచ్చిన కష్టం మరెవరికి రాకూడదు అని ఆమెపై జాలి చూపిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోభోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా నాగచైతన్య తన రెండో పెళ్లి గురించి అందరికి ఒక క్లారిటీ ఇచ్చేసాడు. గతంలో ఒక ఇంటర్వ్యూ లో నాగచైతన్య తనకూ కచ్చితంగా రెండోసారి ప్రేమ పుడుతుంది. అప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చాడు. కానీ సామ్ జీవితంలో మాత్రం రెండో పెళ్లి కలిసిరాదని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ముందే చెప్పారు. మరి నాగచైతన్య పెళ్లి చేసుకుంటే సమంత అన్యాయం అయిపోతుందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.